August 28, 2013

ఆహార భద్రత ఎన్టీఆర్ మానస పుత్రిక: హరికృష్ణ

ఆహార భద్రత బిల్లు తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు మానస పుత్రిక అని మాజీ రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ మంగళవారం అన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఆహార భద్రత బిల్లు గురించి ప్రస్తావించారన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదల ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆరేనని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడుతానని కొందరు మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చిల్లర మాటలకు తాను స్పందించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని హరికృష్ణ అన్నారు