July 31, 2013

టీడీపీ వల్లే రాష్ట్ర విభజన జరుగలేదు : సోమిరెడ్డి

చంద్రబాబు లేఖ ఇస్తే తెలంగాణ ఆపుతామని మంత్రులు శైలజానాథ్, టీజీ మాట్లాడటం సిగ్గుచేటు అని టీడీపీ నేత
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరు పార్టీలు తెలంగాణకు అంగీకారం తెలిపాయని, కేవలం టీడీపీ వల్లే రాష్ట్ర విభజన జరుగలేదన్నారు.
సీమాంధ్రలో వైసీపీతో కాంగ్రెస్ డ్రామాలు ఆడిస్తోందని, వైసీపీతో విభజన ఉద్యమాన్ని రాజేసి, ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణ బిల్లు పెట్టేలోపే రాజధానికయ్యే వ్యయం, సాగునీటి పంపిణీపై స్పష్టత రావాలన్నారు. ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం తమ ఉద్దేశం కాదని ఆయన తెలిపారు.
హైదరాబాద్ సహా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది టీడీపీనే అని గుర్తుచేశారు. కేసీఆర్ పునఃనిర్మాణ వ్యాఖ్యల్లో అర్థం లేదని విమర్శించారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేయాలని సోమిరెడ్డి పేర్కొన్నారు.