August 29, 2013

సోనియా ఇంట్లో పాలేర్లు వారు : పయ్యావుల

తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులపై విరుచుకుపడుతున్నారు.సమైక్యాంధ్ర కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం చేస్తుంఏట సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంట్లో పాలేర్లులా ఊడిగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.వారు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.