October 2, 2013

ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోంది : చంద్రబాబు


ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధ వారం ఉదయం ఢిల్లీలో జరిగిన సిటిజన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్రమే కారణమని విమర్శించారు.

ఉత్తరాఖండ్ బాధితులకు సాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే తానే ముందున్నానన్నారు. గాంధీ, మోదీ ఇద్దరూ గుజరాత్‌లో పుట్టడం కాకతాళీయమే అని ఆయన అన్నారు. ప్రధానిగా పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు పరస్పరం పలకరించుకున్నారు.