October 1, 2013

తెదేపా గుత్తి మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ మృతి

అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయినాథ్ గౌడ్ హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. సాయినాథ్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గుత్తి నియోజక వర్గ అభివృద్ధికి, పార్టీ పటిష్టతకు సాయినాథ్ చేసిన సేవలను బాబు కొనియాడారు.