February 28, 2013

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం : నామా

కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ఆదుకునే పరిస్థితి కేంద్రానికి లేదన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను ఆదుకోవడానికి బడ్జెట్‌లో చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు.