February 28, 2013
బాధగా ఉంది
గుం'టూరు'ను వీడటం బాధగా ఉందని
చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. పాదయాత్ర చేపట్టిన తర్వాత ఏ జిల్లాలోనూ
22 రోజులు ఉండలేదు. గుంటూరు జిల్లాలోనే ఇన్ని రోజులు ఉండి ప్రజల సమస్యలు
తెలుసుకుంటూ 201 కిలోమీటర్లు నడిచానని అన్నారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత
వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు. చంద్రబాబు పాదయాత్ర బుధవారం సాయంత్రం
గుంటూరు జిల్లాలో ముగిసింది. ఈ నెల ఆరో తేదీన జిల్లాలోకి ప్రవేశించిన ఆయన
22 రోజుల పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 126 గ్రామాల్లో 201
కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర కొనసాగించారు. రేపల్లె నియోజకవర్గంలోని
పెనుమూడి వారధిపై కృష్ణానదిని దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు.
Posted by
arjun
at
1:01 AM