November 23, 2012
ఎఫ్డీఐల ద్వారా రైతులకు జరిగే మేలేంటో ప్రభుత్వం చెప్పాలి...నామా నాగేశ్వరరావు
న్యూఢిల్లీ, నవంబర్ 23 : నీలం తుపాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను
ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా
నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్ర మంత్రులు ఉన్నా
బాధితులకు న్యాయం చేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం పార్లమెంట్ వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తుంటే మంత్రులు నవ్వుతూ వెళ్లడం రైతులను హేళన చేసినట్లేనని ఆయన అన్నారు. ఎఫ్డీఐల ద్వారా రైతులకు జరిగే మేలేంటో ప్రభుత్వం చెప్పాలని నామా డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకే ఎఫ్డీఐలకు అనుమతి అని ఎంపీ నామా మండిపడ్డారు.
శుక్రవారం పార్లమెంట్ వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తుంటే మంత్రులు నవ్వుతూ వెళ్లడం రైతులను హేళన చేసినట్లేనని ఆయన అన్నారు. ఎఫ్డీఐల ద్వారా రైతులకు జరిగే మేలేంటో ప్రభుత్వం చెప్పాలని నామా డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకే ఎఫ్డీఐలకు అనుమతి అని ఎంపీ నామా మండిపడ్డారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment