November 27, 2012

బాబుకు మధుమేహం

బాబుకు మధుమేహం
రక్తంలో పెరిగిన చక్కెర శాతం..
అలసటే కారణం: వైద్యులు
యాత్రలో ఇక షుగర్ మాత్రలు!

హైదరాబాద్, నవంబర్ 27 : పాదయాత్రలో ఉండగా మంగళవారం ఉదయం టీడీపీ అధినేతకు షుగర్ లెవల్స్ పెరిగాయి. హైదరాబాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం చంద్రబాబును పరీక్షించింది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు మందులు వాడడం తప్పనిసరి అని నాగేశ్వర్‌రెడ్డి సూచించారు.

యోగా, ఇతర దారుఢ్య సాధనాల వల్ల చంద్రబాబు ఇప్పటి వరకు మాత్రలు వాడకుండానే షుగర్‌ను అదుపులో ఉంచుకున్నారు. అయితే ఒత్తిడి వల్ల షుగర్ స్థాయి పెరిగిందని నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. మందులు వాడడం అత్యవసరం కానప్పటికీ వయసు దృష్ట్యా వాడాలని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు.