November 18, 2012
ఆదివారం పాదయాత్రలో పాల్గొన్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలో ముగిసి.. మెదక్ జిల్లాలో ప్రవేశించింది. పటాన్చెరువు మండలంలోని బిడిఎల్ గేటు వద్ద బాబు యాత్ర మెదక్ జిల్లాలో ప్రవేశించింది. ఈ రోజు చంద్రబాబు పాదయాత్రలో ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, సోదరి హైమావతి, రామకృష్ణ భార్య జయశ్రీ, ఉమామహేశ్వరి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు 49వ రోజు. బాబు యాత్రలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొనడం గమనార్హం. అంతకుముందు బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో ఓ చెట్టు కింద భోజనం చేశారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఇలాగే చైతన్య రథంపై తిరిగారు. బాబు పాదయాత్రతో తెలుగుదేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. భువనేశ్వరి, లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు ఉదయం నుండే బాబుతో కలిసి పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment