January 14, 2013

టీడీపీ భారీ ర్యాలీ



పాల్వంచ నుంచి చంద్రబాబు మీకోసం వస్తున్నా యాత్రలో పాల్గొనేందుకు సుమారు 100 వాహనా ల్లో తెలుగుదేశం నాయకులు ఖమ్మంకు తరలివెళ్లారు. టీడీపీ కార్యాలయం నుంచి వాహనాలు తరలివెళ్లగా, దమ్మపేట సెంటర్ నుంచి సుమారు 85 వాహనాల్లో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి మేడిద సంతోష్, జిల్లా నాయకులు కనగాల బాలకృష్ణ నేతృత్వంలో సుమారు 500 మంది భారీ ర్యాలీగా బయలు దేరి వెళ్ళారు. రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి మల్లెల రవిచంద్ర, మండలాధ్యక్షుడు బరపటి వాసు తదితరులు కూడా ర్యాలీ నిర్వహించారు. భద్రాచలం రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్, రాజీవ్ గాంధీ మార్కెట్, శాస్త్రీ రోడ్, కిన్నెరసాని రోడ్ మీదుగా ర్యాలీ సాగింది. ఈసందర్భం గా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు. ఈ కార్యక్రమాల్లో నా యకులు కాంపెల్లి కనకేష్, చల్లగుండ్ల వీరభద్రం, కనగాల రాంబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకులు నరేష్, సమ్మయ్య, వేపూరి నాగేశ్వరావు, దొప్పల పూడి సురేష్, రేగడి మధు, తన్నీరు ఏసుబాబు, లక్ష్మీ నాయుడు,దొంతగాని రవి, నర్వనేని చందరావు, పొందూరి వెంకట్, జొన్నలగడ్డ కోటేశ్వరావు పాల్గొన్నారు.