January 14, 2013

బాబు యాత్రకు సీపీఐ నేతల సంఘీభావం




పసుపు, ఎరుపు రంగు జెండాలతో ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు కోత్త శోభను సంతరించుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో నిర్వహిస్తున్న మీ కో సం... వస్తున్నా యాత్రకు సీపీఐ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, చం ద్రావతి వందలాది మంది కార్యకర్తలతో సంఘీబావం తెలిపారు. మీ కోసం యాత్ర ఇ ప్పటికే రాష్ట్రంలో 9 జిల్లాలు పూర్తి చేసుకుని, 10వ జిల్లాగా ఖమ్మం లో సా గుతున్న విషయం విదితమే. ఇ ప్పటివరకు ఎమ్మార్పీఎస్ మాత్రమే నే రుగా మీ కోసం యాత్రకు సంఘీబావం ప్రకటించింది. శనివారం రాత్రి ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో చంద్రబాబు పాదయాత్రతో వస్తుండటంతో సీ పీఐ కార్యాల యం వద్ద ఎర్ర జెండాలతో సీపీఐ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీసీఐకు చెందిన ఎమ్మెల్యేలు చంద్రబాబుతో కొంతదూరం నడిచారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జి ల్లా కార్యదర్శి బాగం హేమంత్‌రావు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాకలపాటి వెం కటేశ్వరరావు, పాకలపాటి లలితరాజేశ్వ రి, టీవీ చౌదరి, మౌలాన, సలాం, జ క్కుల లక్ష్మయ్య, మేకల సంగయ్య, పగడాల మల్లేశ్, మేకల శ్రీనివాసరావు, దొం డపాటి రమేశ్, సింగు నర్సింహరావు, అడప రామకోటయ్య, , బోజర్ల సూర్యరావు, మండే వీరహనుమంతరావు, మందడపు తిరుమలరావు, బోల్లేపల్లి స త్యనారయాణ, వై.సాంబశివరెడ్డి, పగిళ్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు చంద్రబాబుకు సంఘీభా వం పల కడంతో టీడీపీ, సీపీఐ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపించింది.