June 24, 2013
యాత్రికులు కటికనేలపై పడుకుంటున్నారు : రాజేంద్రప్రసాద్
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఢిల్లీకి చేరిన తెలుగువారికి ఏపీ భవన్లో జరుగుతున్న అవమానం చూస్తుంటే రక్తం మరుగుతోందని టీడీపీ నేత వైవీబి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. యాత్రికులు కటిక నేలపై పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఎకరాల ఏపీ భవన్ ప్రాంగణం కాంగ్రెస్ నేతలు గంజాయి పండించడానికేనా అని ఆగ్రహించారు. తెలుగు యాత్రికులకు వసతులేవి అని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.
Posted by
arjun
at
5:55 AM