April 29, 2013

ఢిల్లీ-కన్యాకుమారిని దాటిన చంద్రబాబు యాత్ర

హైదరాబాద్

మాజీ ప్రధాని చంద్రశేఖర్ 56 ఏళ్ల వయస్సులో 170 రోజులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 53 ఏళ్ల వయస్సులో 60 రోజులు మాత్రమే పాదయాత్ర చేశారని తెలిపారు. వయస్సురీత్యా వచ్చే అలసట, శారీరక బాధలను పంటి బిగువన అణచుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకోవాలన్న పట్టుదలతో బాబు తన లక్ష్యం చేరుకోగలిగారన్నారు.
: 'ఢిల్లీ నుంచి కన్యాకుమారి మధ్య దూరం 2767 కిలోమీటర్లు. అనంతపురం నుంచి విశాఖపట్నం వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్ర 2817 కిలోమీటర్లు. 63 ఏళ్ల వయస్సులో 208 రోజుల పాటు చంద్రబాబు చేసిన పాదయాత్ర ప్రపంచంలోనే రికార్డు' అని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి దశరథ జనార్దన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.