April 29, 2013
సింహాచలేశునికి పూజలు, కప్ప స్తంభం ఆలింగనం
అప్పన్న సన్నిధిలో చంద్రబాబు, బాలకృష్ణ
సింహాచలం(విశాఖపట్నం): చంద్రబాబు ఆదివారం సింహాచలంలో వరాహ
లక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతోపాటు
బాలకృష్ణ కూడా వున్నారు. తొలుత ఆలయ ఈవో కోడూరు రామచంద్రమోహన్, ప్రధాన
పురోహితుడు మోర్తా సీతారామాచార్యులు ఆధ్వర్యంలో వేదపఠనాలు, మంగళవాయిద్యాల
నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా
మంటపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
తదుపరి గర్భాలయంలో అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆస్థాన మంటపంలో వేదపండితులు ఆశీర్వదించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ పట్టువస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
తదుపరి గర్భాలయంలో అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆస్థాన మంటపంలో వేదపండితులు ఆశీర్వదించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ పట్టువస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
Posted by
arjun
at
6:48 AM