April 30, 2013

సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు : కడియం

వరంగల్
: బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. బయ్యారంలోనే స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలను సీఎం కిరణ బాధ్యత వహించాలన్నారు. తాను టీడీపీ లోనే ఉంటానని కడియం స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఏ పార్టీతోనైనా చర్చిస్తానని ఆయన చెప్పారు.