April 30, 2013
పిల్లలు మీకేనా? మిగిలిన వాళ్లకు లేరా?: టీడీపీ
తన పిల్లలు ఏం కావాలంటూ సీబీఐ అధికారులను ప్రశ్నించిన వైఎస్ భారతి తన
భర్త, మామ వల్ల అక్రమ కేసుల్లో ఇరుక్కొన్న ఇతరుల పిల్లల గురించి ఏనాడైనా
ఆలోచించారా అని తెలుగు యువత నేతలు ప్రశ్నించారు. "రూ. లక్ష కోట్లకు
వారసులైన మీ పిల్లలే పిల్లలా......మిగిలినవారి పిల్లలు పిల్లలు కాదా ''అని
వారు అడిగారు. తెలుగు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి
రాంగోపాల్ రెడ్డి మంగళవారం ఇక్కడ ఒక ప్రకటన చేశారు. 'పులివెందుల
నియోజకవర్గంలోని వేల్పులలో టీడీపీ నేతలు సతీష్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డిపై
మీ కుటుంబ సభ్యులు అక్రమ కేసులు పెట్టి.. జైలుపాలు చేశారు. వీరెవరికి
పిల్లలు లేరా? ఈ వ్యవహారాలతో మీ భర్త, మామలకు సంబంధం లేదని మీ పిల్లలపై
ప్రమాణం చేస్తారా?' అని వారు భారతికి సవాల్ విసిరారు.
Posted by
arjun
at
10:54 PM