April 30, 2013
పార్లమెంట్కు తరలి వెళ్లిన ఎన్టీఆర్ విగ్రహం
వేమూరు : పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,
దివంగత ముఖ్యమం త్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఈ నెల 7వ
తేదీన ఆవిష్కరించనున్నారు. ఈ వి గ్రహాన్ని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన
ప్రముఖ శిల్పి దేవు శంకర్, ఆయన కుమారులు మయాచార్య, నాగమయ నారాయణాచార్యులు,
మరో ఇద్దరు శిల్పుల సహకారంతో రూపొందించారు. టన్ను బరువు కలిగిన తొమ్మిది
అడుగుల కాంస్య వి గ్రహాన్ని తయారు చేసేందుకు ఆరు నెలలు వ్యవధి తీసుకుంది.
రూ.13లక్షల విలువతో కూడిన ఈ విగ్రహాన్ని శిల్పులు వాస్తవికతను ఉట్టిపడేలా రూపొందించారు. మంగళవారం ఉదయం ఈ వి గ్రహాన్ని వేమూరులోని సత్య శిల్పశాల నుండి ఢిల్లీకి తరలించేందుకు సిద్ధం చేశారు. మాజీమం త్రి దేవినేని రాజశేఖర్, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు వి గ్రహాన్ని సందర్శించారు.
ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో ఆవిష్కరించిన ఆచార్య ఎన్జి రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను కూడా వేమూరుకు చెందిన శంకర్ రూపొందించారు. తిరిగి ఆయనకే ఎన్టీఆర్ వి గ్రహం తయారు చేసే అవకాశం దక్కడంపై ఆనందాన్ని వ్యక్త పరిచారు. మంగళవారం సాయంత్రం విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లారీలో ఢిల్లీకి తరలించారు.
రూ.13లక్షల విలువతో కూడిన ఈ విగ్రహాన్ని శిల్పులు వాస్తవికతను ఉట్టిపడేలా రూపొందించారు. మంగళవారం ఉదయం ఈ వి గ్రహాన్ని వేమూరులోని సత్య శిల్పశాల నుండి ఢిల్లీకి తరలించేందుకు సిద్ధం చేశారు. మాజీమం త్రి దేవినేని రాజశేఖర్, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు వి గ్రహాన్ని సందర్శించారు.
ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో ఆవిష్కరించిన ఆచార్య ఎన్జి రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను కూడా వేమూరుకు చెందిన శంకర్ రూపొందించారు. తిరిగి ఆయనకే ఎన్టీఆర్ వి గ్రహం తయారు చేసే అవకాశం దక్కడంపై ఆనందాన్ని వ్యక్త పరిచారు. మంగళవారం సాయంత్రం విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లారీలో ఢిల్లీకి తరలించారు.
Posted by
arjun
at
7:27 AM