April 28, 2013

నేడు అప్పన్న దర్శనానికి చంద్రబాబు రాక

సింహాచలం: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీ కోసం..'పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో ఆదివారం వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆయన ఉదయం పది గంటలకు సింహగిరికి రానున్నారు. చంద్రబాబు రాకను పురస్కరించుకుని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పాశర్ల ప్రసాద్, పిసిని వరహానరసింహం ఆధ్వర్యంలో ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక పుష్కరిణి సత్రం ఆవరణలో నిర్మలా నృత్యనికేతన్ కళాకారులతో 'వస్తున్నా.. మీ కోసం' పాటలకు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.