April 28, 2013

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు

విశాఖ

హైదరాబాద్ శంసాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రెండున్నర గంటలకు బాబు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని నేతలను పరామర్శించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని, ఈ సాయంత్రం ఉప్పల్‌లో జరగనున్న ఎమ్మార్పీస్ యుద్ధభేరి సభలో చంద్రబాబు పాల్గొంటారు.
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం సింహాద్రి అప్పన్నను కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయం అధికారులు బాబుకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. 1-20 గంటలకు బయలుదేరే విమానంలో బాబు హైదరాబాద్‌కు రానున్నారు.