April 28, 2013

విశాఖ సభలో ఆకట్టుకున్న బుర్రకథలు,మిమిక్రీ

సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్
ఉత్సాహపరిచిన సంగీత విభావరి

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా శనివారం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యకర్తలను, అభిమానులను ఆద్యంతం ఉత్సాహపరిచాయి. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా సభా ప్రాంగణంలో ఆశీనులైన వారిని ఉత్సాహపరిచేందుకు రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి.సాయిబాబా సార«థ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ కాంగ్రెస్ వైఫల్యాలను చాటిచెప్పింది.


టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను క«థకుడు తెలియజేస్తుంటే సభా ప్రాంగణంలో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. వీర్నాల కృష్ణ సారథ్యంలో జానపద కళాకారులు తమ గీతాలతో ఆకట్టుకున్నారు. మిమిక్రీ కళాకారులు హరికిషన్, నాగభూషణ్ ... ఎన్టీఆర్, రావుగోపాలరావుతోపాటు హాస్యనటుడు ఎమ్మెస్‌నారాయణ సభకు విచ్చేసినట్టయితే ఏ విధంగా మాట్లాడతారో చక్క

'కదిలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా...త్యాగాలకు వెనుదిరగని దేశభక్తులారా..'అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన తొలి గీతానికి కార్యకర్తలు ఉప్పొంగిపోయారు. ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి చిత్రం నుంచి మనో ఆలపించిన 'జననీ జన్మభూమిచ్ఛా స్వర్గాదపీ, పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి' వంటి గీతాలకు అభిమానులు నృత్యాలు చేశారు. చంద్రబాబు పాదయాత్ర సభా ప్రాంగణానికి చేరే సమయంలో మనో,వందేమాతరం శ్రీనివాస్, సునీత..'చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, సంభవం నీకే సంభవం, ధర్మానికి నువ్వే రాజువై వంటి గీతాల పల్లవులను పాడి హుషారెక్కించారు.

తరువాత చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లీ బందీ అయిపోతుందో తదితర గీతాలు వేదికపై నేత లను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల కోరిక మేరకు బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం చిత్రంలోని జగదానంద తారక, జయజానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం' అంటూ మనో, సునీత ఆలపించగా సభా ప్రాంగణం హర్షాధ్వానాలతో దద్దరిల్లింది.
గా అనుకరించి హర్షధ్వానాలను అందుకున్నారు. తరువాత సినీనటులు మురళీమోహన్, ఏవీఎస్‌ల సార«థ్యంలో వందేమాతరం శ్రీనివాస్, మనోల బృందం ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.