April 28, 2013

విశాఖలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చంద్రబాబు

విశాఖ
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం విశాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సినీ నటుడు బాలకృష్ణ, నారా లోకేష్ లతోపాటు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టి. దేవేందర్ గౌడ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్లారు.