April 28, 2013

పోటెత్తిన వీధులు!

విశాఖపట్నం: వేలాది ద్విచక్ర వాహనాలు..వందలాది కార్లు..బాణసంచా సంబరాలు...సంప్రదాయ నృత్యాల మధ్య సాగిన తెలుగుదేశం ర్యాలీతో విశాఖ నగరం పసుపుమయమైంది. అగనంపూడి వద్ద పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం.. బాలకృష్ణ, పలువురు పార్టీ నాయకులతో కలిసి ఓపెన్‌టాప్ వ్యాన్‌లో సభావేదిక వద్దకు చంద్రబాబు బయలుదేరారు. సుమారు 24 కిలోమీటర్ల మేర మూడు గంటల పాటు ర్యాలీ సాగింది.

ఈ క్రమంలో దారిపొడవునా జనం చంద్రబాబుకు జేజేలతో ఘనస్వాగతం పలికారు. పలు కూడళ్లలో చంద్రబాబు వాహనాన్ని ఆపి బొకేలు, పూలమాలలు అందజేసి అభిమానాన్ని

చంద్రబాబు వెంట మరో వాహనంలో వున్న ఆయన తనయుడు లోకేశ్ పలుచోట్ల కారులో నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ ఉత్సాహపరిచారు. ర్యాలీ వాహనంలో చంద్రబాబు, బాలయ్యతోపాటు పార్టీ నేతలు సుజనాచౌదరి, నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బండారు సత్యనారాయణమూర్తి, వాసుపల్లి గణేష్‌కుమార్, దాడి రత్నాకర్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు ఉన్నారు.
చాటుకున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి, తలపాగాలు అలంకరించారు. కొంతమంది సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ముకుళిత హస్తాలతో ప్రజలకు నమస్కరిస్తూ, కుడిచేతితో అభివాదం చేస్తూ చంద్రబాబు ఉత్సాహంగా ముందుకు సాగారు.