April 28, 2013

అది 420 బ్యాచ్ రేవర్ రెడ్డి ధ్వజ

తెలుగుదేశం అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంతో సభికులను, కార్యకర్తలను ఆకట్టుకున్నారు. వేదికపైకి రాగానే.. ఈ జనసంద్రాన్ని చూసి పక్కనే ఉన్న ఆ సముద్రంలోని అలలు కూడా తలలు వంచాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు అడ్డా అయితే.. అవినీతి అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్‌గా మారిందన్నారు. 'జనం కోసం జగన్.. జగన్ కోసం జనం' అంటూ జఫ్ఫాగాళ్లు చెబుతున్నారని, అవన్నీ ఒట్టిమాటలని కొట్టేపారేశారు.

జగన్ ఫాలోవర్స్ అంతా జఫ్ఫాగాళ్లని వ్యాఖ్యానించారు. వారు ఇప్పుడు "జగన్ కోసం జైలు.. జైలు కోసం జగన్'' అని ప్రచారం చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో జగన్ కేడీ నంబర్‌వన్ అంటూ విమర్శించారు. జగన్ ప్రజా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లలేదని, అవినీతికి పాల్పడితే ప్ర

రాష్ట్ర ముఖ్యమంత్రి నంబర్‌వన్ మూర్ఖుడు అని, ఆయన 420 బ్యాచ్‌కి నాయకత్వం వహిస్తున్నాడని 'మహారాజశ్రీ 420' అని వ్యాఖ్యానించారు. షర్మిలచేస్తున్న సవాళ్లు వానపాము బుస కొట్టినట్టుందన్నారు. కాగా టీడీపీని అంతం చేయడం ఇందిరమ్మ వల్లే కాలేదని, ఇప్పుడు తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల వల్ల ఏమవుతుందని మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు అన్నారు. వైఎస్, కిరణ్ దయ వల్ల మంత్రులు, అధికారులు జైలుకు పోతున్నారని ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎద్దేవా చేశారు.
భుత్వమే జైల్లో వేసిందన్నారు. జగన్ కోసం చోటాలు జైలుకు వెళుతున్నారని, ఆయనేమైనా కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికుడా అని ప్రశ్నించారు.