April 28, 2013

హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్

చంద్రబాబునాయుడు విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. రాజేంద్రనగర్‌వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించి ఇంటికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఈ సాయంత్రం ఉప్పల్‌లో జరగనున్న ఎమ్మార్పీస్ యుద్ధభేరి సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు.
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న ప్రారంభించిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న బాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట కుమారుడు నారా లోకేష్‌నాయుడు, సినీ నటుడు బాలకృష్ణ, పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.