March 29, 2013

టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : తలసాని

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తలసాని, పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో టిడిపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు.