March 29, 2013
టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : తలసాని
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ
లక్ష్యమని నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ
32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తలసాని, పార్టీ శ్రేణులతో
కలిసి ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని
మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ
ముందున్న లక్ష్యమన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో టిడిపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో టిడిపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు.
Posted by
arjun
at
7:36 AM