March 29, 2013

తూ.గో : పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు

తూ.గో: వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం పెదపూడిలో చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. 32 కేజీల కేక్‌ను బాబు కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.