March 29, 2013

టిడిపి ఎమ్మెల్యే సత్యవతికి అస్వస్థత

హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం నాటికి నాలుగోరోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉంది.

పాత ఎమ్మెల్యే క్వార్టర్సులో కూర్చున్న ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు, ఎంపీల ఆరోగ్యాన్ని వైద్యులు ఈ రోజు ఉదయం పరీక్షించారు. వారిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే, ప్రభుత్వం దిగి వచ్చి విద్యుత్ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుం
దని నేతలు చెప్పారు.