May 29, 2013
ఇక బస్సు యాత్ర జూలైలో ముహూర్తం.. పది నెలలు జనంలోనే
'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రకు కొనసాగింపుగా జూలైనుంచి
బస్సుయాత్ర చేపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పది నెలలపాటు
రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజలను కలవనున్నట్లు ఆయన తెలిపారు.
పాదయాత్ర చేయని చోట్ల బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. గండిపేటలో
మహా నాడు రెండోరోజు పార్టీ సంస్థాగత వ ్యవహారాలపై చర్చలో ఆయన మాట్లాడారు.
వచ్చే పదినెలలు పార్టీకి కీలకమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి
పార్టీ సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బస్సు యాత్రకు సమాంతరంగా పార్టీ యంత్రాంగమంతా ప్రజల్లో ఉండేవిధంగా జూన్
1నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని
నిర్వహించనున్నట్లు ప్రకటించారు. "ఇంటింటి కీ వెళ్లండి. అవినీతి,
కుంభకోణాలతో అభివృద్ధి ఎలా దెబ్బతినిపోతోందో.. ప్రజలకు సంక్షేమ
కార్యక్రమాలు ఎలా నిలిచిపోతున్నాయో వివరించండి. మనం గెలిస్తే ఏంచేస్తామో
చెప్పం డి. మన డిక్లరేషన్లలోని అంశాలను వివరించండి. మంచి పాలన కోసం టీడీపీ
అధికారంలోకి రావాలని చాటండి. పార్టీ లో ప్రతి ఒక్కరం ఈ పదినెలలు
రాత్రింబవళ్లు కష్టపడదాం. పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి.
మిమ్మల్ని ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటాను'' అని హర్షధ్వానాల మధ్య
పేర్కొన్నారు.
'పార్టీకి మంచి నాయకులున్నారు. కానీ, విభేదాలు పక్కన పెట్టాలి. భేషజాలు,
ఇగోలు వద్దు. మన కుటుంబంలో తేడాలొస్తే బయటపడకుండా దిద్దుకుంటాం. పార్టీ
లోనూ అలాగే ఉండాలి. అందరినీ కలుపుకొని పోవాలి. అం దరినీ గౌరవించాలి. మనలో
మనం కొట్టుకుంటూ ఓటు వేయాలని కోరితే ప్రజలు హర్షించరు. ఇన్చార్జీలుగా ఉన్న
నేతలు కూడా మారాలి. బాగా పనిచేయాలి. ఇంట్లో పడుకొని గాలి వస్తే
గెలుస్తామనుకుంటే అందరం మునిగిపోతాం. పని చేయని ఇన్చార్జీలను మార్చడానికి
వెనుకాడను.
ఇటీవలి సహకార ఎన్నికల్లో వాటిని పట్టించుకొన్న వారంతా మంచి ఫలితాలు
సాధించారు. వదిలివేసిన వారున్న ప్రాంతాల్లోనే మనకు ఫలితాలు రాలేదు.
కార్యకర్తలకు పదవులు వచ్చే ఎన్నికలను పట్టించుకోకుండా.. మన ఎన్నికలకు
మాత్రం పనిచేయాలంటే వారికి మాత్రం ఏం అవసరం? మనం పట్టించు కోకపోతే వారు
మాత్రం ఎందుకు పట్టించుకుంటారు?' అని వ్యాఖ్యానించారు. కరెంటు చార్జీల
పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 1.80 కోట్ల సంతకాలను
అసెంబ్లీలో ప్రదర్శిస్తామని, తర్వాత సీఎం లేదా గవర్నర్కు సమర్పిస్తామని
చంద్రబాబు తెలిపారు. ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని
కేడర్కు సూచించారు.
'గుర్తు'తోనే స్థానిక ఎన్నికలు
దమ్ముంటే స్థానిక ఎన్నికలను పార్టీ ప్రాతిపదికన నిర్వహించాలని
ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. ఆయారాం.. గయారాంల కోసం పార్టీ
గుర్తు లేకుండా ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తా రు.
పార్టీ గుర్తుపై ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో వెనుకబడినవర్గాలకు 50 శాతం స్థానాలను రిజర్వ్ చేయాలని
డిమాండ్ చేశారు. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందని,
వైసీపీ వెలవెలబోయిందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నిక ల్లో సైకిల్ జోరు
పెంచాలని, అసెంబ్లీ ఎన్నికల విజయానికి ఈ ఫలితాలతోనే నాంది కావాలని
పిలుపునిచ్చారు.
దోపిడీ దొంగ పక్కన ఎన్టీఆర్ ఫొటోలా?
"ఎన్టీఆర్ చారిత్రక పురుషుడు. శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నా,
శ్రీకృష్ణుడన్నా ఆయనే కళ్లలో మెదులుతారు. భవిష్యత్తులోనూ ఎన్టీఆర్ను ఎవరూ
అధిగమించలేరు. అలాంటి ఎన్టీఆర్ ఫొటో పక్కన లక్షకోట్లు దోచుకున్న జగన్వంటి
వ్యక్తు ల ఫొటోలు పెట్టడమా?'' అని చంద్రబాబు ఆగ్రహించారు. ఎన్టీఆర్ ఫొటోను
ఎవరు పెట్టుకున్నా ఫర్వాలేదని, అటువం టి దొంగలు పెట్టుకోవడం దారుణమని
మండిపడ్డారు. అవినీతిని కడిగేసేందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు
యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీని మరింత బలోపేతం
చేయడానికి విద్యాధికులంతా ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఫేస్బుక్ వంటి
సామాజిక వెబ్సైట్లను ఉపయోగించుకుని పార్టీలో ఉత్తేజం నింపడంతోపాటు
మేధావులు, విద్యార్థులు, యువతను ఆకర్షిద్దామన్నారు.
Posted by
arjun
at
8:53 AM