September 25, 2013
లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది
జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచుతా: చంద్రబాబు
'బొగ్గు గనుల కుంభకోణంలో ఫైళ్ళు మాయం కావడంతో ఏకంగా ప్రధాని కూడా సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సిన దుస్ధితి వచ్చింది. లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది. ఇదే పరిస్ధితి ఉంటే దేశం కుప్పకూలడం ఖాయం. అవినీతి కేసుల్లో నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చేసి మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తేనే మన దేశాన్ని, సమాజాన్ని కాపాడుకొన్నవారం అవుతాం. అది జరగాలంటే కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి. అందుకే జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచాలని అనుకొంటున్నాను. మనతో భావసారూప్యం ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడగట్టి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను బలోపేతం చేస్తాను. గతంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో టిడిపి ప్రధాన పాత్ర పోషించింది. ఈసారి కూడా అటువంటి పాత్రను తీసుకొందాం. అది జరగాలంటే ఇక్కడ రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండు వైపులా మెజారిటీ సీట్లు సాధించాలి. ఇదే మన లక్ష్యం' అని ఆయన వారితో అన్నారు.
courtessy: andhrajyothy
Posted by
arjun
at
10:36 AM