November 27, 2013

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లే...........

తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపలేమని భావించి, ఆ భయంతోనే విభజన పేరుతో ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ కొత్త వాదం ప్రవేశపెట్టారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.ఆమె అతి తెలివి ఫలించదని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో సోనియాకు ముఖం చెల్లడంలేదు. అందుకే ఇక్కడకు రావడంలేదు. జగన్ ముసుగులో వస్తున్నది. ఈ ముసుగు తీసి చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లేనని ఆయన హెచ్చరించారు.