September 26, 2013

20 రాష్ట్రాల్లో విభజనవాదం ఉన్నా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌నే విచ్చిన్నం చేయాలనుకోవడం కుట్రే

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ దెబ్బతీస్తోందని టీడీపీ నేత కావూరి సాంబశివరావు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ 20 రాష్ట్రాల్లో విభజనవాదం ఉన్నా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌నే విచ్చిన్నం చేయాలనుకోవడం కుట్రే అని మండిపడ్డారు. రాహుల్‌ను ప్రధాని చేయడానికే విభజన ప్రకటన చేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని విమర్శించారు.

కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం నెలకొందన్నారు. రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ సమైక్యాంధ్ర ముసుగురు ప్రజలు గమనించాలని సూచించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం ఉధృతమవుతోందని, నిర్ణయం వెనక్కి వెళ్లే వరకు ఉద్యమం కొనసాగుతుందని కోడెల తెలిపారు.
 courtessy: andhrajyothy