November 17, 2013

వైసిపికి ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే

విభజనకు కారకులైన కాంగ్రెస్ పార్టీ, దాంతో ఒప్పందం చేసుకున్న వైసిపిలను సీమాంధ్ర నుంచి తరిమికొట్టాలని టిడిపి ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. వైసిపి అండతోనే రాష్ట్రవిభజన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని ఆరోపించారు. వైసిపికి ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లేనని ఆయనవ్యాక్యానించారు.