September 5, 2013

ఏపీలో పర్యటిస్తే ప్రజల బాధలు తెలుస్తాయి

ఏపీలో పర్యటిస్తే అక్కడి ప్రజల బాధలు తెలుస్తాయని టీడీపీ ఎంపీ రమేష్‌ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడారు. సీమాంధ్రలో ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఓ వైపు కమిటీని వేస్తామని చెప్పి,మరో పక్క విభజన ప్రక్రియ వేగం చేస్తామని ప్రకటిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.