September 6, 2013

టిఆర్ఎస్ విలీనం వ్యవహారం ఎంతవరకు వచ్చిందో: మోత్కుపల్లి


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని రావణాకాష్టం చేస్తున్నారని, కేవలం ఆయన కుటుంబ లబ్ది కోసమే కుట్రలు చేస్తున్నారని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు.ఆయనకు రెండువేల పద్నాలుగు వరకు తెలంగాణ రావడం ఇష్టం లేదని ఆయన అన్నారు. డిల్లీలో కూర్చుని ఆయన ఏమి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు వెంటనే రాష్ట్రం రావాలని కోరుతున్నారని, టిఆర్ఎస్ విలీనం వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చెప్పాలని అన్నారు. సత్వరమే ఆ ప్రక్రియ పూర్తి చేసి తెలంగాణ వచ్చేలా చేయాలని ఆయన కోరారు.