February 18, 2013

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ

  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తెలుగు దేశం పార్టీ స్వాగతించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారన్నారు.

ప్రభుత్వ అసమర్థత వల్లే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈసీ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే సహకార సంఘాల ఎన్నికలు లాగానే ఈ ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు.