April 6, 2013

మారిన పాదయాత్ర షెడ్యూల్


తుని: చంద్రబాబు పాదయాత్ర షెడ్యూల్ మారింది. ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడంతో రోజువారీ నడకను కుదించారు. ప్రస్తుతం రోజుకు 10-12 కిలోమీటర్ల మేర చంద్రబాబు నడుస్తున్నారు. కాళ్ల నొప్పులు, చీలమండ గాయం వేధించడంతో ఆయన నడకను రోజుకు 8-9 కిలోమీటర్లకు కుదించారు. ఈసారి ఉగాదిని ఆయన తూర్పుగోదావరి జిల్లాలోనే జరుపుకోనున్నారు. మర్నాడు (12వ తేదీ) సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. తుని పట్టణానికి ఈ నెల 8వతేదీకి ఆయన చేరుకోవాలి. మారిన షెడ్యూల్ మేరకు ఆ రోజుకు ఆయన వి.కొత్తూరుకు చేరుకుంటారు. ఆయన బస కోసం డిగ్రీ కళాశాల వద్ద గల ఖాళీస్థలాన్ని యనమల పరిశీలించారు.