September 21, 2013
ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ
చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు
ఢిల్లీలోనే ఉంటానని, ప్రధాన రాజకీయ నేతలందరినీ కలువనున్నట్లు తెలిపారు.
వారికి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తానన్నారు. ఎవరితోనూ రాజకీయాలు
మాట్లాడనని చంద్రబాబు తెలిపారు. మరికాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో
చంద్రబాబు భేటీ కానున్నారు.
Posted by
arjun
at
12:10 AM