September 21, 2013

ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటానని, ప్రధాన రాజకీయ నేతలందరినీ కలువనున్నట్లు తెలిపారు. వారికి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తానన్నారు. ఎవరితోనూ రాజకీయాలు మాట్లాడనని చంద్రబాబు తెలిపారు. మరికాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో చంద్రబాబు భేటీ కానున్నారు.