September 21, 2013

జగన్ డబ్బును విదేశాలకు చేరవేసిన మయాంక్ మెహతా హాంకాంగ్ నుంచి రాలేదని సీబీఐ కోర్టు చెప్పింది

 టెన్‌జన్‌పథ్, లోటస్‌పాండ్ మధ్య మద్యవర్తిత్వానికే కేవీపీని సీబీఐ వదిలేసిందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. మొదట కేవీపీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీ పాత్రపై సూరీడు సాక్ష్యం చెప్పినా సీబీఐ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జగన్ డబ్బును విదేశాలకు చేరవేసిన మయాంక్ మెహతా హాంకాంగ్ నుంచి రాలేదని సీబీఐ కోర్టు చెప్పిందని...ఇప్పుడు దర్యాప్తు అయిపోయిందని ఎలా ప్రకటించిందని వర్లరామయ్య ప్రశ్నించారు.