September 20, 2013

కెసిఆర్ కన్నా పిట్టకదలు చెప్పగలను

తాము మేధావులు కామని, కాని తెలంగాణ,ఆంద్రలలో జరిగిన అభివృద్దిపై చర్చకు కెసిఆర్ వస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సవాల్ చేశారు. హైదరాబాద్ లో ఎంత అభివృద్ది చేశారో,దానిలో ఎవరి వాటా ఉందో చెప్పడానికి సిద్దంగా ఉన్నామని ఆమె అన్నారు. లక్షలాది జనం ఇప్పుడు సీమాంద్రలో రోడ్లపైకి వచ్చారంటే పనిపాట లేక వచ్చారని అనుకున్నారా అని ఆమె అన్నారు. కెసిఆర్ కన్నా ఎక్కువగా పిట్టకధలు తాము కూడా చెప్పగలమని ఆమె అన్నారు.