September 20, 2013

పేదవాడు దొంగతనం చేస్తే జైలులో పెడతారని, వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని వదలిపెడతారా

జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి ని మూడున్నరేళ్లు జైలులో ఉంచితే, జగన్ ను అప్పుడే వదలిపెడతారా అని టిడిపి ప్రశ్నించింది. జగన్ ను పదహారు నెలలకే వదలిపెట్టే ప్రయత్నం చేస్తోందని రాజకీయాలకు పనికి వస్తారనే అలా చేస్తున్నారని టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ కేసులో ఒక్క ఆస్తి కూడా జప్తు చేయలేదని ఆయన విమర్శించారు. పేదవాడు దొంగతనం చేస్తే జైలులో పెడతారని, వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని వదలిపెడతారా అని ఆయన ప్రశ్నించారు. పొట్లూరు వరప్రసాద్ పేరును ఛార్జీషీట్లలో ఎందుకు చేర్చలేదని ఆయన అన్నారు. సండూర్ పవర్ పై కూడా కేసు పెట్టలేదని ఆయన అన్నారు. మంత్రి గీతారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.