September 23, 2013

సరిగ్గా బెయిల్ వచ్చే రోజున సిబిఐ ఇలాంటి మెమో ఎలా దాఖలు చేస్తుంది


ఎనిమిది కంపెనీలకు సంబంధించి జగన్ కేసులో క్విడ్ ప్రో జరగలేదని సిబిఐ నాంపల్లి కోర్టుకు మెమో ఇవ్వడంపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.సరిగ్గా బెయిల్ వచ్చే రోజున సిబిఐ ఇలాంటి మెమో ఎలా దాఖలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.ఇదే కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ల కుమ్మక్కుకు నిదర్శనమని ఆయన అన్నారు.