June 26, 2013

కావాలనే అడ్డుకుంటున్నారు : బాబు

డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఏపీ తెదేపా, కాంగ్రెస్ ఎంపీల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎంపీల గొడవపై బాబు మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ వరద బాధితులను తరలించడంలో ప్రభుత్వం తెదేపాను అడ్డుకుంటుందని పేర్కొన్నాడు. కాంగ్రెస్ నిజంగా బాధితులను ఆదుకుంటామంటే.. మాకేమీ అభ్యంతరం లేదని, కానీ వారు అలా చేయకుండా బురద రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఏపీ భవన్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైద్యులను బాధితులకు చికిత్స అందించకుండా అడ్డుకున్నారు. ఇప్పుడేమో.. ప్రయాణికులు విశాఖపట్నం వెళ్తారని చెబుతామంటే.. హైదరాబాద్ కు చేరుస్తామని.. చెబుతున్నారంట. మేము ప్రయణికులకు వైజాగ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని బాబు అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని బురద రాజకీయాలకు దిగినా.. బాధితులను తరలించే వరకూ ఇక్కడే ఉంటాని బాబు స్పష్టం చేశారు.