June 26, 2013

బాధితులను ఆదుకోవడంలో బాబు భేష్..!

బదరీనాథ్ లోని బాధితులతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. బాధితులు అనారోగ్యానికి గురైనట్టు బాబుకు చెప్పారు. దీంతో.. ఇద్దరు వైద్యులతో కూడిన బృందాన్ని ప్రత్యేక హెలీకాప్టర్ లో పంపుతున్నట్టు బాబు తెలిపారు. బాధితుల్లో తెలుగువారు తీవ్ర వివక్షకు గురౌతున్నారని పలువురు ఆరోపిస్తున్న నేపధ్యంలో బాబు సేవల్ని అందరూ కొనియాడుతున్నారు. కాగా, మొదటి నుంచి కూడా బాధితులను ఆదుకోవడంలో బాబు చూపివకు చొరవ సర్వత్రా అభినందనలు అందుకుంటోంది.