June 26, 2013
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా నిలిచింది.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా నిలిచింది.
ఏపీ భవన్ లో చికిత్సపొందుతున్న తెలుగువారిని ఆదుకునేందుకు తెదేపా ప్రత్యేక
విమానాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తారఖండ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రీకులను
హైదరాబాద్ తీసుకుని వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.హైదరాబాదులో
వరదబాధితుల సహాయార్ధం ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. 040 30269999, 040
39156425 నంబర్లకు బాధితుల బంధువులు ఫోన్ చేయాల్సిందిగా సూచించింది.
అంతేకాకుండా సికింద్రాబాద్, ఖాజీ పేట, విజయవాడ రైల్వేస్టేషన్లలో పార్టీ
యంత్రాంగం ద్వారా సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిన్న ఏపీ భవన్ లో
తెలుగు వారిని పరామర్శించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక
విమానంలో ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.
Posted by
arjun
at
5:56 AM