June 26, 2013
హెలికాప్టర్ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భాంతి
గౌరీకుండ్ ప్రాంతంలో సహాయ చర్యల్లో పాల్గొంటున్న భారత వాయుసేన హెలికాప్టర్ కూలిపోయి 19మంది దుర్మరణం పాలవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. అపశ్రుతి చోటుచేసుకున్నా ముక్కవోని ధైర్యంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్న సైనిక సిబ్బందిని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు వరద బాధితుల సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Posted by
arjun
at
9:32 PM