June 29, 2013

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఉత్తరాఖండ్‌లో వరద బాధితులకు సహాయసహకారాలు అందజేస్తున్న టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, రమేష్‌రాథోడ్‌తో అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జోష్‌మఠ్‌కు కొనకళ్ల, బద్రీనాథ్‌కు రమేష్‌రాథోడ్ వెళ్లాల్సిందింగా బాబు ఆదేశించారు. అక్కడున్న తెలుగు వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు.