June 29, 2013
టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
ఒకే నెలలో పెట్రోలు రేట్లు రెండు సార్లు విపరీతంగా
పెరగడం, రాష్ట్ర మద్యం విధానంలోని వైరుధ్యాలపై తె లుగుదేశం పార్టీ
తీవ్రంగా విరుచుకుపడింది. పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు
శనివారం నాడు భేటీ అయ్యారు.
త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికలు,
పెట్రోల్ ధరల పెంపు, మద్యం పాలసీలపై ఈ భేటీలో వారు చర్చించినట్లు
తెలుస్తున్నది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల
సమస్యలను గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగిస్తున్నారని
సీనియర్లు ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
Posted by
arjun
at
8:49 AM