June 29, 2013

యాత్రికుల అనుభావాలు బాధించాయి:బాబు


హైదరాబాద్ : చార్‌ధామ్ యాత్రికుల అనుభావాలు తనను తీవ్రంగా బాధించాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులు నరకం అనుభవించారని తెలిపారు. వరద బాధితుల విషయంలో ఢిల్లీలో జరిగిన ఘటన తనను చాలా బాధించింది అని చెప్పారు. తెలుగు వారి కోసం ఢిల్లీలో కట్టిందే ఏపీ భవన్ అని గుర్తు చేశారు. వరద బాధితులను ఏపీ భవన్ బయట టెంటు వేసి ఉంచడం దారుణమన్నారు. మానవతా దృక్పథంతోనే వరద బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు పలు బృందాలను ఏర్పాటు చేసి తమ వారిని సురక్షితంగా తీసుకెళ్లాయని తెలిపారు. మన రాష్ట్రం మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.