June 29, 2013
'స్థానికం'పై టీడీపీ సదస్సులు
స్థానిక ఎన్నికల సమరానికి శ్రేణులను సమాయత్తం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. శనివారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో నిర్వహించిన భేటీలో తీర్మానించినట్లు ముఖ్య నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇ.పెద్దిరెడ్డి విలేకరులకు తెలిపారు. గ్రామ, మండలస్థాయి నేతలను ఈ సదస్సులకు ఆహ్వానించి ఎన్నికలకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తగ్గకుండా చూడాలని, లేకపోతే గట్టిగా పోరాడాలని నేతలకు సూచించినట్లు తెలిపారు
Posted by
arjun
at
10:30 PM